నిర్మాత ని మోసం చేసిన ఇలియానా ?
|
ఇలియానా |
విక్రం, అనుష్క జంటగా రూపొందుతున్న తాజా చిత్రం "దైవ తిరుమగళ్". ఈ చిత్రానికి నిర్మాత మోహన్ నటరాజన్. అయితే ఈ సినిమా లో ముందుగా ఇలియానా ని హీరోయిన్ గా పెట్టాలనుకున్నాడట. దీనికి గాను 35 లక్షలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడట. అయితే తర్వాత ఇలియానా ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఈ చిత్రానికి ఇచ్చిన డేట్స్ ని "3 ఇడియట్స్" రీమేక్ కి ఇచ్చిందట ఇలియానా. దీంతో నిర్మాత వేరే హీరోయిన్ ని చూసుకున్నాడు. కానీ ఇలియానా మాత్రం నిర్మాత తనకిచ్చిన 35 లక్షలను మాత్రం తిరిగి ఇవ్వలేదట. నిర్మాత ఫోన్ చేస్తే జవాబు కూడా ఇవ్వలేదట. దీంతో నిరాశ చెందిన నిర్మాత సదరు నిర్మాతల మండలి కి ఫిర్యాదు చేసి ఇలియానా ని బ్యాన్ చేయాలని కోరాడట.
0 comments:
Post a Comment