Home » , , » దూకుడు విజయోత్సవ వేడుకల్లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి

దూకుడు విజయోత్సవ వేడుకల్లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి

Mallu Surf
మహేష్ బాబు తాజా హిట్ చిత్రం "దూకుడు" విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకొని 100 రోజుల దిశగా వెళుతున్న సందర్భం గా విజయోత్సవ వేడుకలు విజయవాడ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దూకుడు సినిమా టీం తో పాటు కృష్ణ, విజయ నిర్మల తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉల్లాసం గా కొనసాగింది. మొదట సింగర్ లు సినిమా లోని పాటలు పాడి అశేషంగా వచ్చిన అభిమానులను అలరించారు. దాని తర్వాత వేదిక పైకి ఒక్కొక్కరిగా అతిథులను ఆహ్వానించి జ్ఞాపికలని ఇచ్చి సత్కరించారు. కార్యక్రమం లో పాల్గొన్న పలువురు దూకుడు సినిమా ని, మహేష్ బాబు ని ప్రశంసలతో ముంచెత్తారు.

                                         అయితే ఇక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విజయ నిర్మల మాట్లాడుతూ దూకుడు సినిమా లో ఒక మంచి నాయకుడి గా ఉండే ప్రకాష్ రాజ్ అకస్మాత్తుగా చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చినట్లు ఒక్కసారి దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా వస్తే చూడాలని కోరికగా ఉందని తెలిపారు. ఒక్కసారిగా సభా ప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లింది. మొత్తానికి విజయ నిర్మల తన అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger